యువ నటుడు శర్వానంద్ కథానాయకుడి నటించిన సినిమా ‘రణరంగం’. సుధీర్వర్మ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 2న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే, ప్రస్తుతం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు రెండో వారంలో సినిమాను తీసుకొచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
ఒక క్రిమినల్ ఎలా మాఫియా లీడర్గా మారాడన్న కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్కు విశేష స్పందన వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోపక్క తమిళ రీమేక్ 96లో శర్వానంద్ నటిస్తున్నాడు. ఇటీవల గాయపడిన ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.