ప్రముఖ సెలబ్రిటీ ఫొటో గ్రాఫర్ దబ్బో రతానీ తాజాగా పలువురు బాలీవుడ్ తారలతో 2020 క్యాలెండర్ను రూపొందించారు. డబూ రత్నానీ 25 సంవత్సరాలుగా ఏటా సినీ తారలతో క్యాలెండర్ను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా రూపొందించిన ఈ క్యాలెండర్ కోసం ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, విద్యాబాలన్, విక్కీ కౌశల్, సైఫ్ అలీఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కృతిసనన్, సన్నీలియోనీ, భూమి పెడ్నెకర్, కియారా అద్వాణీ ఫొటోషూట్లో పాల్గొన్నారు. వీరితోపాటు కొత్తగా అనన్యపాండే మొదటిసారి దబ్బో రతానీ క్యాలెండర్లో భాగమయ్యారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ముంబయిలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో రేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయా సెలబ్రెటీలు సోషల్మీడియా వేదికగా షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. కథానాయికలందరి ఫొటోలు కాస్త హాట్గా ఉండగా, కియారా అడ్వాణీ లుక్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ట్విటర్ వేదికగా నెటిజన్లు కియారా లుక్ను ట్రోల్ చేస్తున్నారు.