HomeTelugu Trendingమనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటున్నామా: వర్మ

మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటున్నామా: వర్మ

1 32‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్ నిర్వహణకు నిన్న విజయవాడకు వెళ్లిన వర్మను పోలీసులు బలవంతంగా హైదరాబాద్ తిరిగి పంపిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించిన వర్మ ‘నన్ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పట్లేదు. జగన్ మీద దాడి జరిగితే పోలీసులు విమానాశ్రయంలోకి రాలేదు. నన్ను మాత్రం విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటున్నామా అన్న సందేహం కలుగుతోంది. విజయవాడలో ఉండటానికి వీలు లేదని పోలీసులు బెదిరించారు. ఇదేమైనా వేరొక దేశమా. ఎందుకు మమ్మల్ని అనుమతించలేదు’ అని ప్రశ్నించారు. నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇది ముమ్మాటికీ ఏపీ ప్రభుత్వం కుట్రలో భాగమే. మేము దేనికీ భయపడే ప్రసక్తే లేదు. మే 23 వ తేదీలో ప్రజలు కూడా వారికి తగిన గుణపాఠం చెప్పబోతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu