HomeTelugu Big Storiesఆచార్య: సానా కష్టం సాంగ్‌పై ఆర్‌ఎంపీల ఫిర్యాదు

ఆచార్య: సానా కష్టం సాంగ్‌పై ఆర్‌ఎంపీల ఫిర్యాదు

Rmp doctors union files com

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ డైరెరక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, చిరు తనయుడు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటూ.. ఫ్యాన్స్‌ కోసం వరసగా ఓక్కో అప్‌డేట్‌ ఇస్తూ మూవీపై ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్‌. ఈ సినిమా ఫిబ్రవరి విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. తాజాగా ఆచార్య నుండి విడుదలై స్పెషల్‌ సాంగ్‌ వివాదంలో చిక్కుకుంది.

ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్‌ఎంపీ డాక్టర్ల సంఘం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ‘సానా కష్టం అంటూ సాగే ఈ పాటలో ఓ చోట లిరిక్స్‌ తమ మనోభవాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ ఆర్‌ఎంపీ డాక్టర్ల సంఘం తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఓ చోట ‘ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు’ అనే లైన్‌ వివాదానికి దారితీసింది. పాటలోని ఈ లిరిక్స్‌ ఆర్‌ఎంపీ వృత్తిని కించపరిచేలా ఉందని, ఆర్‌ఎంపీ, పీఎంపీల మనోభవాలను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ఆర్‌ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు.

అంతేగాక జనగామలోని రాష్ట్ర ఆర్‌ఎంపీల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పాట రచయిత, సినిమా దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని, సినిమాలో ఈ పాటను నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu