HomeTelugu Trendingగీతాఆర్ట్స్ తో 'తేజ్‌' మరో సినిమా

గీతాఆర్ట్స్ తో ‘తేజ్‌’ మరో సినిమా

4 29మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు ఇటు యూత్ కి .. అటు మాస్ ఆడియన్స్ కి ఆయనను చేరువ చేసిన సినిమాల్లో ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఒకటి. అల్లు అరవింద్ ఈ సినిమాతో తేజ్‌ను కొంతవరకూ నిలబెట్టగలిగారు. ఈ మధ్య కాలంలోను తేజ్‌ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్ పై అల్లు అరవింద్ .. తేజుతో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత కూడా తేజ్‌తో అల్లు అరవింద్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అన్నారు. త్వరలోనే ఆ వివరాలను తెలియపరచనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu