మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా సుబ్బు పరిచయమౌతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. మే 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలైన తరువాత నెలకి, మరో ప్రాజెక్టును సాయి ధరమ్ తేజ్ పట్టాలెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి దేవ కట్టా దర్శకత్వం వహించనున్నాడు.
‘డైనమేట్’..’ఆటో నగర్ సూర్య’ వంటి చిత్రాల ద్వారా దేవ కట్టా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన తయారు చేసిన కథ కొత్తగా అనిపించడంతో వెంటనే సాయితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఎమోషన్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సాయితేజ్ లుక్ ను .. ఆయన పాత్రను దేవకట్టా చాలా విభిన్నంగా చూపించనున్నాడని చెబుతున్నారు. కాగా హీరోయిన్, విలన్ పాత్రల్లో ఎవరు అనే తదితద అంశాలను త్వరలో వెల్లడించనున్నారు.