నందమూరి ఇంట విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (52) ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సోమవారం ఉదయం ఫ్యాన్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఉమా మహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే ఆమె కూతురి వివాహం ఘనంగా జరిగింది.