టాలీవుడ్లో ఇప్పుడు ఐటి దాడుల కలకలం రేపుతుంది. ఉన్నట్లుండి జరిగిన ఐటి దాడులతో ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్
అవుతున్నాయి. నాని లాంటి స్టార్ హీరో.. సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతలపై ఐటి దాడులు జరగడం సంచలనమే. ఇక దీనిపై
కూడా ఇప్పుడు టాలీవుడ్ సంచలన నటి శ్రీ రెడ్డి సంచలన పోస్ట్ చేసింది. ఈమె మరోసారి తన చేతికి పని చెప్పింది. ఐటి
దాడులను సమర్థిస్తూ రెచ్చిపోయింది హాట్ బ్యూటీ.
హైదరాబాద్లో జరిగిన ఐటీ దాడులపై ఆమె చాలా సంతోషపడుతుంది. ముఖ్యంగా తను ఎప్పట్నుంచో టార్గెట్ చేస్తున్న వాళ్లపైనే ఇప్పుడు ఐటి దాడులు జరగడంలో ఎగిరి గంతేస్తుంది.సురేష్ బాబు తనయుడు అభిరామ్తో చాలా రోజులు ఈమె డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని అందరిముందు సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. అలాంటి అభిరామ్ తండ్రి సురేష్ బాబు ఇల్లు, ఆఫీస్పై ఐటి దాడులు జరిగాయి. మరోవైపు తననులైంగికంగా వాడుకున్నాడని హీరో నానిపై చాలా ఏళ్లుగా ఆమె నోరు పారేసుకుంటుంది.
ఆ హీరోపై కూడా ఐటి దాడులు జరగడంతో మనశ్శాంతిగా కనిపించింది శ్రీ రెడ్డి.అందుకే దేవుడు ఉన్నాడు సురేష్ బాబు గారూ అంటూ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. మరోవైపు మోడీజీ థ్యాంక్స్ అంటూ పోస్ట్కూడా చేసింది. శ్రీ రెడ్డి కమెంట్స్ చూసి చాలా మంది ఆమెకు సపోర్ట్ చేస్తుండటం విశేషం. మరికొందరు విమర్శిస్తున్నారు కూడా.అసలు నిజాలు పక్కనబెడితే శ్రీ రెడ్డి టార్గెట్ అయిన సురేష్ బాబు, నాని ఇంటిపై ఐటి దాడులు మాత్రం యాదృశ్చికమే.