HomeTelugu Trendingశ్రీదేవి తిరిగి వచ్చిందా అని భ్రమపడతారు

శ్రీదేవి తిరిగి వచ్చిందా అని భ్రమపడతారు

1 1అతిలోక సుందరి శ్రీదేవి గతేడాది హఠాత్తుగా దుబాయ్ లోని ఓ హోటల్ లో బాత్ టబ్ లో అనుమాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తార. కాగా, ఇప్పుడు ఈ అందాల తార శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సింగపూర్ లోని మేడం టుస్సాడ్ మ్యూజియంలో పెట్టబోతున్నారు. సెప్టెంబర్ 4 వ తేదీన ఆమె విగ్రహాన్ని పెడుతున్నారు. బంగారు వర్ణంలో ఉండే దుస్తులతో ధగధగ మెరిసిపోతున్నది విగ్రహాం. విగ్రహానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు.

దీనికి సంబంధించిన చిన్న వీడియోను బోనికపూర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎవరైనా సరే ఆ విగ్రహాన్ని చూస్తే.. అది నిజమైన విగ్రహం అని భ్రమపడటం గ్యారెంటీ. ఎందుకంటే విగ్రహం అంత అద్భుతంగా జీవకళ ఉట్టిపడేలా ఉన్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu