HomeTelugu Big Storiesసంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. లోగో విడుదల

సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. లోగో విడుదల

Suresh productions launches

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రఖ్యాత నిర్మాత డి.రామానాయుడు 1964లో నెలకొల్పిన సురేశ్ ప్రొడక్షన్స్ తమ తొలి ప్రయత్నంగా ఎన్టీఆర్ తో ‘రాముడు-భీముడు’ చిత్రాన్ని నిర్మించి ఘన విజయంతో తమ ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. అనంతరం ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించింది. ఇప్పటికి వివిధ భాషలలో సుమారు 124 సినిమాలు నిర్మించి తనదైన ముద్ర వేసింది. ఈ సురేశ్ సంస్థ ఇప్పుడు తాజాగా సంగీత ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తోంది.

ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఈ రోజు ఓ ప్రకటన చేసింది. ‘ఏభై సంవత్సరాల మా సినిమా వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ.. ‘సురేశ్ ప్రొడక్షన్స్ మ్యూజిక్’ పేరిట సంగీత ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తున్నామని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. వినసొంపైన, వీనులవిందైన సంగీతాన్ని అందించడమే మా లక్ష్యం” అంటూ సదరు సంస్థ పేర్కొంది. దీనితో పాటుగా ‘SP మ్యూజిక్’ కు సంబంధించిన లోగోను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేశారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతోన్న ‘నారప్ప’, ‘దృశ్యం 2’ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu