HomeTelugu Trendingప్రముఖ తమిళ దర్శకుడు మృతి

ప్రముఖ తమిళ దర్శకుడు మృతి

Tamil director sp jananatha

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్‌సీ జననాథన్ ఆదివారం కన్నుమూశారు. జననాథన్‌ అకాలమరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు, ఇతర నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన రోల్ మోడల్, కమ్యూనిస్ట్‌ సిద్ధాంతకర్త కారల్‌ మార్క్స్‌ వర్ధంతి రోజే ఆయనకూడా కన్నుమూశారంటూ గుర్తు చేసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డైరెక్టర్ జననాథన్ ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూశారని మరో డైరెక్టర్ ఆర్ముగకుమార్‌ ట్వీట్‌ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కాగా విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ లాబాం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు జననాథన్. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ మూవీని ఈ సంవత్సరం విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. జననాథన్ 2004 సంవత్సరంలో అయ్యర్‌కై సినిమాకు తమిళంలో జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డును గెలుచుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu