Homeతెలుగు Newsఏపీ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: సినీ నటుడు శివాజీ

ఏపీ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: సినీ నటుడు శివాజీ

7 1రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10శాతం అధికారులు పనిచేస్తున్నారని సినీ నటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో ప్రభుత్వంపై కొత్త తరహా దాడులకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. చుక్కల భూముల సమస్య రాజకీయ ఎత్తుగడగా మారిందని ఆరోపించారు. చుక్కల భూముల వ్యవహారంలో అధికారులు మంత్రులను సైతం లెక్కచేయడం లేదన్నారు. చుక్కల భూములను ఈస్ట్‌ ఇండియా కంపెనీ రెగ్యులరైజ్‌ చేసిందని గుర్తు చేశారు. ‘చుక్కల భూముల పేరుతో కుట్రకు తెరతీశారు. చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పాలని చూస్తున్నారు. కొందరితో కేసులు వేయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అధికారులకు ఏం బాధ, వారికి నచ్చకపోతే రాజీనామా చేసి ఇష్టమొచ్చిన పార్టీలో చేరవచ్చు. కొందరు మాజీ అధికారులూ అదే పనిచేస్తున్నారు. జగన్‌కు సీఎం కుర్చీ కావాలి.. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టవు. చుక్కల, చెరువు భూముల పేరుతో ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం హామీ ఇచ్చినా అధికారులు మోకాలడ్డుతున్నారు. అన్ని ఆధారాలను సీఎంకు అందజేస్తా. సంక్రాంతి పండుగ లోపు చుక్కల భూముల సమస్య పరిష్కరించకపోతే అధికారుల తీరుకు నిరసనగా ఆమరణ దీక్ష చేస్తా’ అని నటుడు శివాజీ హెచ్చరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu