HomeTelugu Trendingఆమని ప్రధాన పాత్రలో సందేశాత్మక చిత్రం 'అను'

ఆమని ప్రధాన పాత్రలో సందేశాత్మక చిత్రం ‘అను’

Anu movie

సీనియర్ నటి ఆమని నటించిన తాజా చిత్రం అను. అవి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ మూవీకి దర్శకుడు, నిర్మాత సందీప్ గోపిశెట్టి. ఈ చిత్రంలో కార్తిక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తి చక్రవర్తి, దేవి ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా నటి ఆమని మాట్లాడుతూ ఇందులో చాలా మంచి పాత్ర చేశాను, క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది.. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత సందీప్‌కు థాంక్స్ అన్నారు. మంచి సందేశాత్మక చిత్రం అవుతుందన్నారు.

దర్శక నిర్మాత సందీప్ గోపిశెట్టి మాట్లాడుతూ.. ఇది తన మొదటి చిత్రం అయినా ఇందులో ఆమని, దేవి ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు లాంటి పెద్ద వాళ్లందరూ నటించారు. ఈ మూవీ అద్భుతంగా వచ్చింది అన్నాడు. సెప్టెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ మూవీలో ప్రశాంత్ కార్తి విలన్‌గా నటించాడు. పోసానికి కొడుకుగా నటించాడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని దేవీ ప్రసాద్ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu