- ప్రముఖ డైరెక్టర్ పి.చంద్రశేఖర్రెడ్డి(86) కన్నుమూశారు. ఈ రోజు ఉదయం 8.30గంటలకు చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రశేఖర్రెడ్డి సుమారు 80 చిత్రాలు తీశారు. నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం పేటలో 1933 అక్టోబర్ 14న జన్మించారు.కృష్ణ, శోభన్బాబు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. 1971లో కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందిన ‘అనూరాధ’ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు.
- కృష్ణ హీరోగా మొత్తం 20 చిత్రాలు తెరకెక్కించారు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. భలే అల్లుడు, మనవుడు దానవుడు, కొడుకులు, జగన్నాయకుడు, బడిపంతులు, విచిత్ర దాంపత్యం, రగిలే గుండెలు, నవోదయం, పాడిపంటలు, బంగారు కాపురం, రాజకీయ చదరంగం, అన్నా వదిన, పెద్దలు మారాలి, పట్నవాసం, అన్నా చెల్లెలు తదితర చిత్రాలకు పి.సి.రెడ్డి దర్శకత్వం వహించారు.