
Tollywood IT Raids:
టాలీవుడ్లో ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడులు సినీ పరిశ్రమలో పెను కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఒక నిర్మాణ సంస్థపై జరిగిన దాడిలో, 2020-21 కాలానికి చెందిన లావాదేవీల రికార్డులు కలిగిన ఓ ఎక్సెల్ షీట్ గుర్తించారు. ఇది ప్రముఖ నిర్మాణ సంస్థలు మరియు ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్లకు సంబంధించినదిగా అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ ఎక్సెల్ షీట్లో పెద్ద మొత్తంలో డబ్బు మార్పిడి జరిగినట్లు తెలుస్తోంది. దీని విలువ మొత్తం రూ.80 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇది “వైట్ మనీ నుండి బ్లాక్ మనీ” లేదా “బ్లాక్ నుండి వైట్” మార్పిడి వంటి అంశాలను సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది పరిశ్రమలో ఉన్న నిర్మాణ సంస్థలు తమ లావాదేవీలను అర్థవంతంగా వివరించాల్సిన అవసరాన్ని పెంచుతోంది. ఐటీ విభాగం ఈ లావాదేవీల్లో భాగమైన ఇతర నిర్మాణ సంస్థల అకౌంట్స్ను సమీక్షించనుంది. త్వరలో ఈ సంస్థలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
ఇందులో ప్రధానంగా ప్రస్తావనలోకి వచ్చిన సంస్థ టాలీవుడ్లో వేగంగా చిత్రాలను నిర్మించే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ. ఈ సంస్థకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి వల్ల పరిశ్రమలోని ఇతర నిర్మాణ సంస్థలు, నిర్మాతలు ఎంతో టెన్షన్కు గురవుతున్నారు.
ALSO READ: టోవినో థామస్, త్రిషా నటించిన Identity OTT స్ట్రీమింగ్కు సిద్ధం!