HomeTelugu Newsవెబ్‌ సీరిస్‌లో సవతులుగా ఇద్దరు హీరోయిన్స్‌..

వెబ్‌ సీరిస్‌లో సవతులుగా ఇద్దరు హీరోయిన్స్‌..

Varalakshmi Aishwarya Greenకరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే సినీ పరిశ్రమకు చాలా నష్టం కలిగింది. దీంతో చాలా మంది నిర్మాతలు వారి సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి మొగ్గు చుపుతున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీల రాకతో వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌లు, స్టార్ సెలబ్రెటీలు వెబ్ సిరీస్ ల్లో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌లు సమంత, కాజల్, తమన్నా వంటి వారు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్స్ కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తమిళ వెబ్ సిరీస్‌లో నటించడానికి వరలక్ష్మీ శరత్‌కుమార్, ఐశ్వర్య రాజేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట! అయితే ఇందులో వీరిద్దరూ సవతులుగా నటించనున్నట్లు తెలుస్తుంది. సూర్య సుబ్రమణ్యన్ డైరెక్షన్‌లో ఈ సిరీస్ ను అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తుంది. ఇలాంటి ఎమోషనల్ వెబ్ సిరీస్ లో నటిస్తే తమకు మంచి గుర్తింపు వస్తుందని వరలక్ష్మీ , ఐశ్వర్య ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu