HomeTelugu Trendingతెలుగు 'దృశ్యం-2' షురూ

తెలుగు ‘దృశ్యం-2’ షురూ

Drishyam 2 shooting start
‘Drushyam-2’ shooting start

విక్టరి వెంకటేష్‌, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళీ రీమేక్‌ చిత్రం ‘దృశ్యం’. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. తాజాగా ‘దృశ్యం-2’ ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశారు. మొదటి భాగానికి శ్రీప్రియ దర్శకత్వం వహించగా ప్రస్తుత సీక్వెల్‌కు మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్‌ మెగాఫోన్‌ పట్టనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. మార్చి 5 నుంచి రోజువారీ‌ షూటింగ్‌ జరగునున్నట్టు చిత్రబృందం తెలిపింది. కొవిడ్‌ ప్రభావం ఇంకా తగ్గని కారణంగా పరిమిత సిబ్బందితోనే షూటింగ్‌ చేయనున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే మలయాళంలో తెరకెక్కిన ‘దృశ్యం2’ ప్రముఖ ఓటీటీ అమెజాన్‌లో విడుదలై విమర్శకుల ప్రసంశలు అందుకుంది. పార్ట్‌-3కి కూడా ఉంటుంది అని డైరెక్టర్‌ జీతూ ఇటీవలే వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu