HomeTelugu Big Storiesఆస్కార్ అకాడ‌మీ స‌భ్యులుగా విద్యాబాల‌న్‌, ఏక్తా క‌పూర్‌

ఆస్కార్ అకాడ‌మీ స‌భ్యులుగా విద్యాబాల‌న్‌, ఏక్తా క‌పూర్‌

Vidya balan and ekta kapoor

ప్రపంచ సినీ రంగంలో ఆస్కార్ అకాడెమీ అవార్డులకు ఉన్న ప్రత్యేకత గురించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాదికి సంబంధించి కొత్త సభ్యుల వివరాలను ఆస్కార్ అకాడెమీ వెల్లడించింది. ఆ లిస్టులో మ‌న భార‌తీయ న‌టీన‌టులు కూడా ఉన్నారు. బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌తో పాటు టీవీ నిర్మాత ఏక్తా కపూర్‌, ఆమె త‌ల్లి శోభా క‌పూర్‌లో ఈ ఏడాది రిలీజ్ చేసిన ఆస్కార్ కొత్త క‌మిటీలో స‌భ్యులుగా ఉన్నారు. మొత్తం 50 దేశాల‌కు చెందిన 395 మంది స‌భ్యుల‌తో జాబితాను ఆస్కార్ అకాడ‌మీ రిలీజ్ చేసింది.

ద క్లాస్ ఆఫ్ 2021 పేరుతో రిలీజ్ చేసిన లిస్టులో 46 శాతం మంది మ‌హిళ‌లు ఉన్నారు. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌హానీ, ఫ్యామిలీ డ్రామా తుమ్‌హ‌రి సులు లాంటి చిత్రాల్లో విద్యాబాల‌న్ న‌టించి ప్ర‌శంస‌లు పొందారు. పా, బూల్‌బుల‌య్యా, ప‌రిణీత‌, బాబీ జాసూస్‌, శ‌కుంత‌లా దేవి లాంటి చిత్రాల్లోనూ ఆమె న‌టించారు. 2011లో వ‌చ్చిన ద డ‌ర్టీ పిక్చ‌ర్ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించిన విద్యాబాల‌న్‌కు జాతీయ ఫిల్మ్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే. బాలాజీ టెలి ఫిల్మ్స్‌కు చెందిన ప్రొడ్యూస‌ర్లు ఏక్తా క‌పూర్‌, శోభా క‌పూర్‌లు కూడా ఆస్కార్ అకాడ‌మీలో కొత్త స‌భ్యుల‌య్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu