దర్శక ధీరుడు రాజమౌళి తెరక్కెకించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎంతటి క్రేజ్ని తెచ్చుకుందో తెలసిందే. ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా మార్చేసింది. భారీ కలెక్షన్లతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు కూడా ఈ చిత్రాన్ని వరించింది.
ఇక పాటల సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు ఎప్పటి నుండో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నే ఉన్నాయి. ఈ సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని సినిమా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన్నట్టు ప్రముఖ కాలమిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు.
ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ను రాజమౌళి డైరెక్ట్ చేస్తారని లేదంటే ఆయన పర్యవేక్షణలో మరొకరు దర్శకత్వం వహిస్తారని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నట్టు తెలిపారు. రాజమౌళి కలల ప్రాజెక్టు అయిన మహాభారతం కూడా వస్తుందన్నారు. మహేశ్ బాబుతో రాజమౌళి తీయబోయే జంగిల్ అడ్వెంచర్ సినిమా పూర్తయిన వెంటనే మహాభారతం తెరకెక్కిస్తారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారని మనోబాల ట్విట్టర్ లో పేర్కొన్నారు.