HomeTelugu Newsశ్రీనివాస్ రెడ్డి, నాగచైతన్య ఆ రెండు ఎందుకు ఆగిపోయాయి..!

శ్రీనివాస్ రెడ్డి, నాగచైతన్య ఆ రెండు ఎందుకు ఆగిపోయాయి..!

10 14అక్కినేని యువ హీరో నాగచైతన్య ‘జోష్’ మొదలు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాడు. అందులో కొన్ని సూపర్ హిట్ అందుకున్నాయి. కొన్ని పరాజయం పాలయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో ఇది సాథరణ విషయామే. ఇటీవలే నాగచైతన్య నటించిన మజిలీ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం వెంకిమామ సినిమా చేస్తున్నాడు.

వెంకిమామతో పాటుగా ఈ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటె, టాటా బిర్లా మధ్యలో లైలా, డమరుకం వంటి సినిమాలు తీసిన శ్రీనివాస్ రెడ్డి గతంలో నాగచైతన్యతో సినిమా చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. డమరుకం విజయం తరువాత చైతుతో సినిమా చేయాలని శ్రీనివాస్ రెడ్డికి సూచించారట. దాదాపు 10 నెలల పాటు శ్రీనివాస్ రెడ్డి కష్టపడి స్క్రిప్ట్ వర్క్ చేశారు. కానీ, ఎందుకో సినిమా మొదలుకాలేదు. ఆ తరువాత చైతుతోనే దుర్గ అనే సినిమా స్టార్ట్ చేసినా అదికూడా వర్కౌట్ కాలేదని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రాగల 24 గంటల్లో అనే సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!