HomeTelugu Newsచంద్రబాబు ఇంటికీ మా పార్టీ రంగులు వేస్తాం: వైసీపీ

చంద్రబాబు ఇంటికీ మా పార్టీ రంగులు వేస్తాం: వైసీపీ

8 12

ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీ భవనాలన్నింటికీ వైసీపీ పార్టీ రంగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై గత కొద్ది రోజులుగా టీడీపీ-వైసీపీ మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. కానీ.. తాజాగా జరిగిన ఈ వాగ్వాదంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కావాలంటే మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి కూడా వైసీపీ రంగులు వేస్తామంటూ జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రైతు భరోసా అంశంపై కృష్ణా జిల్లాలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వైవీబీ, జోగి రమేష్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమీక్షా సమావేశంలో.. జోగి రమేష్ మాట్లాడుతున్న సమయంలో వైవీబీ అడ్డుకుని రుణమాఫీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన తీర్పుతో రైతులు నష్టపోయారని అన్నారు. అలాగే పంచాయతీ భవనాలన్నింటీకీ.. వైసీసీ పార్టీ రంగులు వేయిస్తున్నారని ఆ అధికారం మీకు ఎవరిచ్చారని జోగిని ఉద్ధేశిస్తూ మండిపడ్డారు. సమాధానంగా జోగి మాట్లాడుతూ నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు కూర్చోవోయ్.. నిన్ను కొడతా అంటూ వైవీబీని ఉద్ధేశించి అన్నారు. కావాలంటే చంద్రబాబు ఇంటికి కూడా వైసీపీ పార్టీ రంగులు వేయిస్తాం, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu