HomeTelugu Newsఆ హీరోతో గొడవలపై స్పందించిన సాయిపల్లవి

ఆ హీరోతో గొడవలపై స్పందించిన సాయిపల్లవి

‘ఫిదా’ సినిమాతో తెలుగు ఇండస్ర్టీలో అడుగుపెట్టిన హీరోయిన్‌ సాయి పల్లవి. మొదటి చిత్రంతోనే మంచి గుర్తపు తెచ్చున్న ఈమె వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. నటిగా మంచి పేరు తెచ్చుకున్న సాయి పల్లవికి ఈగో ప్రాబ్లమ్ ఉందని,  తన హీరోలతో గొడవ పెట్టుకుంటుందన్న వార్తలు కూడా వచ్చాయి. MCA చిత్రం సమయంలో నానితో, కణం షూటింగ్‌లో నాగశౌర్యతో సాయి పల్లవి గొడవ పడినట్టుగా వార్తలు వచ్చాయి.

4

అయితే తాజాగా సాయిపల్లవి హీరో శర్వానంద్‌ గొడవ పడట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి. అయితే శర్వా, సాయిపల్లవికి మధ్య గొడవ కావటంతో షూటింగ్‌ కు బ్రేక్‌ పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ఆమె ఈ వార్తలపై స్పందించారు . ‘శర్వానంద్‌, పడి పడి లేచే మనసు సినిమాతో పాటు మరో సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వాల్సి వచ్చిందని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవ’ ని ఆమె క్లారిటీ ఇచ్చారు. కాగా ‘పడి పడి లేచే మనసు’ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా డిసెంబర్‌ 21న రిలీజ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu