HomeTelugu Newsఓ అత్యుత్తమైన రాజకీయ నేతను కోల్పోయం: బాలకృష్ణ

ఓ అత్యుత్తమైన రాజకీయ నేతను కోల్పోయం: బాలకృష్ణ

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణంపై నందమూరి బాలకృష్ణ స్పందిచారు. కరుణానిధి మృతి రాజకీయాలకు మాత్రమే కాదు.. చిత్రపరశ్రమకూ కూడా తీరని లోటు అని పేర్కొన్నారు. ఓ అత్యుత్తమైన రాజకీయ నేతను కోల్పోయామని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదు.

2 8

అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన లేని లోటు తీర్చలేనిది’ అని విచారం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని బాలకృష్ణ తెలియజేశారు. మరోవైపు మోహన్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌ తదితర టాలీవుడ్‌ ప్రముఖులు కరుణానిధి మృతిపై సంతాపం తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu