HomeTelugu News'కురుక్షేత్రం' ట్రైలర్‌ను విడుదల చేసిన నాని

‘కురుక్షేత్రం’ ట్రైలర్‌ను విడుదల చేసిన నాని

సీనియర్‌ నటుడు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరో గా నటించిన 150వ సినిమా ‘కురుక్షేత్రం’. ఈ చిత్రంలో ప్రసన్న, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, వైభవ్‌, సుహాసిని, శ్రుతి హరిహరణ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అరుణ్‌ వైద్యనాథన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాను ‘నిబునన్’ టైటిల్‌తో తమిళంలో విడుదల చేశారు. దీనికి అక్కడ విశేషమైన స్పందన లభించింది. త్వరలో చిత్రం తెలుగులోనూ విడుదల కాబోతోంది.కాగా ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ హీరో నాని విడుదల చేశారు. ‘నాకు ఇష్టమైన నటుడు అర్జున్‌ 150వ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. అర్జున్‌ ఇందులో పోలీసు అధికారి పాత్రలో కనిపించారు.

9 13

‘చూసే వాళ్ల దృష్టిని బట్టి పెయింటింగ్‌ అర్థం మారుతుంది. ఏం అర్థమైందో చూసి చెప్పండి’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. అర్జున్‌ సతీమణి ఆయన్ను ఈ ప్రశ్న అడిగారు. దీనికి ఆయన ‘ఇదిగో నీలం కనిపిస్తోందే అది కొలను.. ఇక్కడ ఓ హత్య జరిగింది. ఇదిగో ఇక్కడ తెట్లు తెట్లుగా ఎర్రగా కనిపిస్తోందే అదే రక్తం. ఈ కత్తి పట్టుకెళ్తున్నాడే.. చంపేసి వెళ్తున్నాడు’ అని పోలీసు దృష్టితో దాన్ని వర్ణించారు. ఒక పోలీసు వాడికి రాకూడని వ్యాధి.. అంటూ వైద్యురాలు అర్జున్‌ ఆరోగ్య సమస్య గురించి చెబుతూ కనిపించారు. యాక్షన్‌-థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‘మనం ఎలా ఆలోచిస్తున్నామో వాడూ అలానే ఆలోచిస్తున్నాడు. కాబట్టి.. మనం వాడికంటే ముందుండాలి’ అంటూ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu