HomeTelugu Newsకేరళ వరదల కారణంగా 'శైలజా రెడ్డి అల్లుడు' వాయిదా..?

కేరళ వరదల కారణంగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ వాయిదా..?

నాగా చైతన్య హీరోగా నటించిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా..రీ రికార్డింగ్ వర్క్ ఇంకా పూర్తికాలేదు. గోపి సుందర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు మారుతి రీ రికార్డింగ్ వర్క్స్ ను దగ్గర ఉండి చూసుకోవడానికి కేరళ వెళ్ళాడు. అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మారుతి అక్కడే ఉండిపోయాడట.

14 5

దానితో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యంగా.. లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నట్టు సమాచారం. దీంతో పాటు సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా కారణం చేత సినిమా ఆగష్టు 31 న రాలేని పక్షంలో సెప్టెంబర్ 4 న విడుదల చేసేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!