HomeTelugu News'ధఢక్' ఆ బాధ నుంచి నన్ను తేరుకునేలా చేసింది

‘ధఢక్’ ఆ బాధ నుంచి నన్ను తేరుకునేలా చేసింది

 

‘ధఢక్’ సినిమా తన తల్లి మరణాన్ని తట్టుకునేందుకు ఎంతో ఉపయోగపడిందని అంటున్నారు దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌. జాన్వి నటిస్తున్న తొలి చిత్రం ‘ధఢక్’. శశాంక్‌ ఖైతాన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్ ఖత్తర్ ఇందులో కథానాయకుడిగా నటించారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రం జూలై 20 వ తేదిన విడుదల కానుంది.

3 17

అయితే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే శ్రీదేవి హఠాన్మరణం చెందారు. దాంతో జాన్వి తన తల్లి మరణాన్ని తట్టుకోగలరా? సినిమా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారా? అన్న సందేహాలు మొదలయ్యాయి. కానీ జాన్వి అన్నింట్లోనూ చక్కగా పాల్గొంటున్నారు. తల్లి లేరన్న బాధ నుంచి ఎలా తేరుకున్నారు? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జాన్వి ఇలా సమాధానం ఇచ్చారు.

‘అది అంత సులువైనది కాదు. నా పని, కుటుంబం నాలో ధైర్యాన్ని నింపాయి. ఒకవేళ చిత్రీకరణలో పాల్గొనలేకపోయినా, నటించలేకపోయినా పరిస్థితి ఇంకా దారుణంగా మారేది. చెప్పాలంటే అమ్మలేదన్న బాధ నుంచి నన్ను తేరుకునేలా చేసింది ‘ధఢక్‌’ సినిమానే. ఈ సినిమా నాకు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది.’ అని తెలిపారు.

ట్రైలర్‌ లాంచ్‌ సమయంలో కపూర్‌ కుటుంబం అంతా జాన్వి కోసం వచ్చింది. అనిల్‌ కపూర్‌, బోనీ కపూర్‌, సంజయ్‌ కపూర్‌, హర్షవర్ధన్‌ కపూర్‌, ఖుషి కపూర్‌ హాజరయ్యారు. ఆ సమయంలో ఓ విలేకరి శ్రీదేవి గురించి ప్రశ్నించడంతో జాన్వి, ఖుషి కన్నీరుపెట్టుకోవడం అక్కడున్నవారిని కలిచివేసింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu