HomeTelugu Big Storiesపార్టీ లో కలుసుకున్న ఆ ముగ్గురు స్టార్‌ హీరోలు

పార్టీ లో కలుసుకున్న ఆ ముగ్గురు స్టార్‌ హీరోలు

జూలై 25 న దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు కావడంతో స్టార్‌ హీరోలు మహేశ్‌, ఎన్టీఆర్‌, రాంచరణ లు వంశీ పైడీపల్లి ఇచ్చిన పార్టీలో కలుసుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇంతకుముందు ఎన్టీఆర్ , చరణ్ లు నటించగా తాజాగా మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు. వంశీ కాంబినేషన్‌లో.. ఎన్టీఆర్‌ బృందావనం, చరణ్‌ ఎవడు చిత్రాల్లో నటించాగ ఆ చిత్రాలు సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. ఇప్పడు మహేశ్ బాబు వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ దర్శకుడు పుట్టినరోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించాడు.

6 27

ఆ వేడుకలో మహేశ్‌, ఎన్టీఆర్‌, చరణ్, పూజా హెగ్డే, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత దిల్‌ రాజు కూడా పాల్గొన్నారు. ఇక వీళ్ళతో పాటుగా మరికొంతమంది ప్రముఖులు కూడీ హాజరయ్యారు. మొత్తానికి అగ్ర హీరోలు మందు పార్టీలో కలుసుకోవడం ఆ పిక్స్ బయటకు రావడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తే విషయమే. అగ్ర హీరోలు విబేధాలు లేకుండా కలిసి పోతున్నారు కానీ హీరోల అభిమానులు మాత్రం ఒకరిపై ఒకరు కత్తులు దూస్తూ ఉంటారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!