1971లో ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంతో నిర్మాతగా సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన చిత్ర నిర్మాత, ప్రముఖ కన్నడ డిస్ట్రిబ్యూటర్ ఎం.భక్తవత్సలం ఆదివారం మరణించారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచినట్లు కుంబ సభ్యులు తెయజేసారు. ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంతో నిర్మాతగా సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈయన కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలికి ఏడేళ్ళపాటు అధ్యక్షుడిగా కొనసాగారు.
సౌత్ ఇండియాన్ ఫిలించ చాంబర్ అధ్యక్షుడిగా, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎంపికైన అతి చిన్న వయస్కుడిగా కూడా ఆయన రికార్డు నిలిచారు. అలాగే బెంగళూరులోని శారద, మినర్వ, లావణ్య, మైసూరులోని లక్ష్మీ సినిమా టాకీస్లకు యజమానిగా ఉన్నారు. భక్తవత్సల మృతిపట్ల కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సంతాపం ప్రకటించారు.