HomeTelugu Big Storiesబాబు యు టర్నుల బాగోతాలు

బాబు యు టర్నుల బాగోతాలు

చంద్రబాబు ఊసరవెళ్లిలా రంగులు మార్చడంలో దిట్ట. కొన్నిసార్లు ఊసరవెళ్లి కూడా ఆశ్చర్యపోయేలా ఆయన రంగులు మారుస్తారు. ఆయన యూటర్న్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌. ఏ విషయంలో అయినా సరే యూటర్న్‌ తీసుకోవడంలో చంద్రబాబు/ తెలుగుదేశం పార్టీకి మించిన వారు దేశంలో లేరేమో. ఎన్నికల సమయంలో తన అవసరాల కోసం కాంగ్రెస్‌ పార్టీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకుని ప్రధాని నరేంద్రమోడిని రాయడానికి కూడా రానటువంటి పదాలతో తిట్టిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా బీజెపితో కలిసిపోవాలని చూస్తున్నారు.

2014 ఎన్నిక సమయంలో రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. అదే చంద్రబాబు 2019లో కాంగ్రెస్‌పై వ్యతిరేకతను పక్కనబెట్టి ఆ పార్టీతో చేతు కలిపారు. దీన్ని ఊసరవెల్లిలా రంగు మార్చడం అని, మిమ లేనటువంటి వ్యక్తని టిడిపి పార్టీవారే అన్నారు.
ప్ర‌త్యేక‌హోదా, ప్ర‌త్యేక ప్యాకేజిపై చంద్ర‌బాబునాయుడు ఎన్ని మార్లు పిల్లిమొగ్గ‌లు వేసింది అంద‌రూ చూసిందే .చివ‌ర‌కు నాలుగేళ్ళు బిజెపితో అంట‌కాగి హ‌టాత్తుగా ఎన్డీఏలో నుండి  బ‌య‌ట‌కు వ‌చ్చేసిన త‌ర్వాత ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో యుట‌ర్న్ తీసుకుని మొద‌టి నుండి పోరాటం చేస్తున్న‌ది తానే అన్నంత‌గా బిల్డ‌ప్ ఇచ్చిన విషయం తెలిసిందే.  రాష్ట్రాభివృద్ధిపై టర్న్ లపై యూటర్న్ లు తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు తన హయాం లో భుజాలకెతుకున్న కాంట్రాక్టర్లను,వ్యాపారవేత్తలపై కూడా యూ టర్న్ లు తీసుకుంటూ తన వక్రబుద్ధిని‌ బయట పెట్టుకుంటున్నారని పారిశ్రామికవేత్తలు ఆయన ధోరణి పై మండిపండుతున్నారు..పోలవరం కాంట్రాక్ట్ పనులను ఓ పత్రికాధిపతి అధినేత వియ్యంకుడైన నవయుగ కంపెనీకు ఇవ్వడం వల్ల అప్పట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి తీని డబ్బాకొట్టాడు.అయితే బాబు నిర్ణయం‌వల్ల పోలవరం పనుల్లో నవయుగ భారీగా నష్టపోయిందనే నిజాలూ ఉన్నాయి.
chandrababi naidu
తిమ్మిని బమ్మి చేయడంలో చంద్రబాబు నేర్పరి.  ఇక లేనిదీ ఉన్నట్లు ఉన్నదీ లేనట్లు చూపడంలో పచ్చమీడియా దిట్ట. మేఘా కృష్ణారెడ్డి కి పట్టి సీమ, ముచ్చుమర్రి, పురుషోత్తమ పట్నం పోర్ట్, కృష్ణ, గోదావరి,పెన్నానదుల అనుసంధానం,కొండవీటి వాగు ప్రాజెక్టు పనులను అప్పజెప్పాడు. పట్టి సీమను సకాలంలో పూర్తి చేసినందుకు మేఘా కృష్ణా రెడ్డిని కూడా భారీ బహిరంగ సభ పెట్టి సన్మానించాడు చంద్రబాబు.పట్టిసీమ పనులు జరిగినప్పుడు చైనా మోటర్స్ తో ,చైనా టెక్నాలజీ తో ప్రాజెక్ట్ పూర్తి చేసామని ఘనంగా చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారిన వెంటనే చైనా మోటర్స్ పైనా , ఆ టెక్నాలజీ వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరుగుతుందన్న బిల్డప్ ఇస్తూ అభివృద్ధి పనులపై మళ్లీ యూటర్న్ లు తీసుకోవడం వంటిహేయమైన చర్య ఆయనకే చెల్లింది.
చైనా ప్రభుత్వం సహాయంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీ తో రాజధాని భవనాలను నిర్మిస్తున్నామని చైనా లో ప్రెస్‌ మీట్ పెట్టి మరి చెప్పాడు. చైనా ప్రతినిధులకు కూడా అమరావతి వచ్చి వెళ్లిపోయారు. ఇక రాష్ట్రం లో పెట్టుబడులు కోసం ప్రజాధటర్న్ ఖర్చుపెట్టి చైనా, జపాన్,సింగపూర్, మలేషియా, లలో తిరిగి అక్కడి టెక్నాలజీ తో ఏపి ను సింగపూర్ చేస్తానన్న బాబు ఇప్పుడు కేవలం చైనా మోటర్ల విషయంలో తెలివి తక్కువగా మాట్లాడటం అందరిని విస్మయపరుస్తోంది.
ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కంపెనీలు మాత్రం ఐదేళ్లలో‌నయాపైసా పెట్టుబడి పెట్టలేదు.ఇక పట్టిసీమతో పాటు  ముచ్చుమర్రి,పురుషోత్తమ పట్నం పోర్ట్, కృష్ణ, గోదావరి,పెన్నానదుల అనుసంధానం,కొండవీటి వాగు లాంటి ప్రాజెక్టులు   దాదాపు 38వేల కోట్ల రూపా మేఘా కృష్ణారెడ్డి కి కట్టబెట్టాడు చంద్రబాబు అప్పుడు పట్టిసీమను పూర్తి చేసినందుకు గాను సన్మానాలు జరిపిన మాజీ సీఎం చంద్ర బాబు ఇప్పుడు మేఘా కంపెనీ పై విశాఖపట్నం లో మాటాడిన తీరు ఆయన దుర్మార్గపు రాజకీయాన్ని బయటపెట్టి మరో యూటర్న్ తీసుకున్నాడు. తన పచ్చమీడియా ,సోషల్ మీడియా భజనబృందాలతో పారిశ్రామికవేత్త లపై విషం కక్కిస్తూ మోసగించడంలో కొత్త యూటర్న్ తీసుకున్నాడు.
ఈ నలభై ఏళ్లలో రాజకీయంగా తాను ఎదగడడానికి తన పార్టీ లో వారినే  అధికార నిచ్చెనలు ఎక్కించి..తర్వాత అధ:పాతాళానికి తొక్కేసిన మాజీ సీఎం‌చంద్రబాబు ఇప్పుడు మళ్లీ తన యూటర్న్ మార్గాన్ని  ఎంచుకున్నాడని పార్టీ నేతలే చెప్పు కుంటున్నారు.ఎన్నికలు సమయం లో రాహుల్ గాంధీ తో పొత్తు కోసం మోడీ ని నోటికొచ్చినట్టు మాట్లాడిన చంద్ర బాబు నాయుడు రాజకీయంగా కాంగ్రెస్ కు హ్యాండిచ్చి మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపి కి దగ్గరకావాలని కొత్తకుట్రలకు సిద్దమవుతున్నాడు..బాబును నమ్మిన కాంగ్రెస్ కి ఈ యూ టర్న్ కొత్త షాకునిస్తోంది..అయితే ఓ వైపు ఏపి బీజేపి ఇంచార్జ్ వున్న సునీల్ దియోధరా మాత్రం బాబు ను ఎట్టి పరిస్థితులలో కూడా బాబు తీసుకోవాలనుకుంటున్న యూటర్న్ కి గేట్ లు క్లోజ్ చేసామని చెబుతున్నాడు..అయినా బాబు యూటర్న్ ప్రయత్నాలు,లాబీయింగ్  మాత్రం సుజనా చౌదరి ద్వారా నడుస్తూనే వుందని టీడిపి నేతలు చెబుతున్నారు..ఎన్నికల సమయంలో మోడీని,అమిత్ షాను  రాయకూడని భాషలో తిట్టిన తాము మళ్లీ బీజేపి ను‌పొగడ్తూ మాటాడాలంటే సిగ్గుగా వుందని యూటర్న్ పై మదనపడుతున్నారు
chandrababu naidu
బాబు కు యూటర్న్ లు కొత్తకాదు..యూటర్న్ కు బాబు కూడా కొత్త కాదు. అయితే నిజాన్ని చెప్పే అలవాటు ఏ రోజు చంద్ర బాబుకు అలవాటు లేదన్నది జనమెరిగిన సత్యం.. నాలుగునెలలకే తన అనుభవాన్ని ఉపయోగించి  తిమ్మిని బమ్మిని చేసే చంద్రబాబు ఎప్పుడు ఏ యూటర్న్ తీసుకున్నా అది తన లాభాని తప్ప జనానికి ఉపయోగపడేది కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం పడుతున్నారు
యూటర్న్ అనేపదం కూడా తన వ్యక్తిత్వాన్ని ,సహజత్వాన్ని‌ వదులుకునేలా  చంద్రబాబు ప్రవర్తిస్తుండటంతో ఇప్పుడు రోడ్లపై యూటర్న్ లు మాయమై బాబు ఫోటోలతో నిండిపోయాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu