HomeTelugu Newsమహేష్‌తో తన పిల్లల చర్చలు..?

మహేష్‌తో తన పిల్లల చర్చలు..?

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు షూటింగ్‌కు ఏ మాత్రం విరామం దొరికిన పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు ఈ రాజకుమారుడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతు మహేశ్ ఆయన భార్య నమ్రతనే తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని .. తనకు అవకాశం వస్తే పిల్లలను స్కూల్‌కి కూడా పంపించనని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాక మహేశ్ తన పిల్లలను బాగా గారాబం చేస్తుంటారు. కాగా ఈ విషయాని నిరూపించే ఫొటో ఒకటి నమ్రత శిరోద్కర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దానితో పాటు ‘ఘర్‌ ఘర్‌ కి కహానీ(ప్రతి ఇంటిలో జరిగేదే).. పిల్లలు అడిగిన దానికి తల్లి ఒప్పుకోకపోతే వెంటనే జరిగే పని వెళ్లి వాళ్ల నాన్నను కాకా పట్టడం’అనే సందేశాన్ని కూడా జత చేశారు.

3 16

నమ్రత షేర్‌ చేసిన ఫోటోలో సితార, గౌతమ్‌లు మహేష్‌బాబుతో ఏదో విషయం గురించి సీరియస్‌గా చర్చిస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో తీసిన ఈ ఫోటోలో మహేష్‌ తన కుటుంబంతో కలిసి మళ్లీ ఎక్కడికో విహారానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఇంతకు సితారా, గౌతమ్‌ ఏ విషయం గురించి వాళ్ల నాన్నతో చర్చిస్తున్నారనే విషయాల గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. అలానే మహేష్‌ బాబు, ఆయన పిల్లలకు మధ్య చర్చలు ఫలించాయా లేదా అనే విషయం గురించి కూడా తెలియలేదు. ప్రస్తుతం మహేశ్‌బాబు 25వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు . మహర్షి పేరుతో తెరకెక్కుతున్న చిత్రం 2019 సమ్మర్‌లో విడుదల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu