HomeTelugu Newsమహేష్‌ బాబు 25లోగో విడుదల చేసిన సితార, ఆద్యలు

మహేష్‌ బాబు 25లోగో విడుదల చేసిన సితార, ఆద్యలు

‘భరత్‌ అనే నేను’ వంటి బ్లాక్‌బస్టర్‌ విజయం తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తన 25వ చిత్రం నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. కాగాప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినిదత్, పివిపి లు సంయుక్తంగా నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల డెహ్రాడూన్‌లో పూర్తయింది. మరి కొద్ది రోజుల్లో రెండో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గోవా వెళ్లనుంది.

14

అయితే ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ని మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 9న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ లోగో పోస్టర్‌ని మహేష్ బాబు కూతురైన సితార, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురైన ఆద్యలు విడుదల చేశారు. ఒక వైపు అభిమాన నటుడి పుట్టినరోజు, మరో వైపు చిత్ర ఫస్ట్ లుక్.. ఆగస్ట్ 9న రాబోతుండటంతో మహేష్ అభిమానులు డబుల్ ధమాకా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu