HomeTelugu Newsసమ్మర్‌ బరిలో చిరు,మహేష్..?

సమ్మర్‌ బరిలో చిరు,మహేష్..?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 25 సినిమా మహర్షి 2019 ఏప్రిల్ 5 న విడుదల కాబోతున్నది. అదే నెలలో మెగాస్టార్‌ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం సైరా కూడా రిలీజ్‌ చేయాలని ప్లానంగ్‌ చేస్తున్నారని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అయితే రామ్‌ చరణ్ నిర్మాతగా మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న సైరా నరసింహారెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్‌కే రిలీజ్ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

3 11

గతంలో బాహుబలి రిలీజ్ సమయంలోనూ పోటి ఉండకూడదన్న ఉద్దేశంతో మహేష్‌ శ్రీమంతుడు సినిమాను వాయిదా వేశాడు. ఇప్పుడు చిరంజీవి, మహేష్ సినిమాలు ఒకే నెలలో రాబోతున్నాయి. చిరు సినిమా చారిత్రాత్మక కథతో వస్తున్నది కాబట్టి, ఆ సినిమా మీద రెస్పెక్ట్ తో మహేష్ మహర్షిని వాయిదా వేసుకునే అవకాశం ఉండొచ్చని క్లోజ్డ్ వర్గాల సమాచారం. ఒకవేళ సైరా ఆలస్యమైతే మహర్షి సేమ్ డేట్ కు రిలీజ్ అవుతుంది. ఆలస్యం కాకుంటే మాత్రం మహేష్ సినిమా వాయిదా పడొచ్చు. మహేష్.. చిరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మహేష్ తన సినిమాను వాయిదా కూడా వేసుకోవచ్చు. మరి ఇప్పుడు సైరా కోసం కూడా తన సినిమా వాయిదా వేస్తాడా..? లేక బరి దిగుతాడా చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu