HomeTelugu Trending'మా' ఎన్నికల బరిలో నటుడు రఘుబాబు

‘మా’ ఎన్నికల బరిలో నటుడు రఘుబాబు

Actor raghu babu contest in

‘మా’ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 10న ఆదివారం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ఈసీ నోటిఫికేషన్లో పేర్కొంది. దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ మొత్తాన్ని ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ ఆదేశాలతో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఏడాది అధ్యక్ష అభ్యర్థులగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ పోటాపోటీగా తలపడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ని ప్రకటించగా.. తాజాగా విష్ణు ప్యానల్‌ నుంచి ఓ కీలక నటుడి పేరు బయటకు వచ్చింది. నటుడు రఘుబాబు ప్రధాన కార్యదర్శి పదవి కోసం విష్ణు ప్యానల్‌ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆయన జనరల్‌ సెక్రటరీగా విజయం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు, జనరల్‌ సెక్రటరీ పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత పోటీ పడతుండగా, బండ్ల గణేశ్‌ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu