టాలీవుడ్ స్టార్ హీరోయన్ల్లో కాజల్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటినా ఇంకా అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నది. ఇండస్ట్రీలో దాదాపుగా అందరు హీరోలతో నటించింది. అవకాశాలు తగ్గినపుడు రెమ్యునరేషన్ తగ్గించుకోవడం, చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తూ హిట్స్ కొట్టడం చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాతో మంచి విజయం అందుకుంది.
కాగా, ఇప్పుడు ఆచార్య సినిమాలో కూడా ఈ చందమామ కనువిందు చేయనుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారరంగంలోకి కూడా అడుగుపెట్టింది. ముంబైలో కాజల్ ఓ జ్యువెలరీ షాప్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాజల్ చెల్లెలు వ్యాపారం చూసుకుంటోంది. అయితే, లాక్డౌన్ కారణంగా గత నెలరోజులుగా అన్ని రకాల వ్యాపారలావాదేవీలు బంద్ అయ్యాయి. దీంతో ఈ అమ్మడు వ్యాపారానికి భారీ నష్టం వచ్చినట్టుగా తెలుస్తోంది.