HomeTelugu Trendingబస్టాండ్‌లో సాయి పల్లవి.. ఎవరూ గుర్తుపట్టలేదు

బస్టాండ్‌లో సాయి పల్లవి.. ఎవరూ గుర్తుపట్టలేదు

5 6ఫిదా సినిమాతో తెలంగాణలో మంచి పేరు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. భానుమతి హైబ్రిడ్ పిల్లగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు విరాటపర్వం సినిమా చేస్తున్నది. ఈ సినిమా షూటింగ్ వరంగల్ లో జరుగుతున్నది. వరంగల్ జిల్లాలోని పరకాల బస్టాండ్ లో జరుగుతున్నది. షూటింగ్‌ చేస్తున్నారు అంటే హడావిడి ఉంటుంది అని చెప్పి…అసలు షూటింగ్ జరుగుతున్నట్టు కాకుండా చాలా కామ్‌గా షూటింగ్ ను పూర్తి చేశారు.

సాయి పల్లవి సాధారణ అమ్మాయి గెటప్ లో డ్రెస్ చేసుకొని పరకాల బస్టాండ్‌ లో బస్ కోసం ఎదురు చూస్తుంది. ఆమెను ఎవరూ గుర్తు పట్టలేదు. ఆ తరువాత బస్సు రాగానే ఎక్కేసింది. బస్ ఎక్కిన తరువాత ఓ అమ్మాయి సాయి పల్లవిని గుర్తు పట్టి సెల్ఫీ దిగింది. షూటింగ్ జరుగుతుంది అంటే హడావుడి ఉండాలి. కెమెరాలు ఉండాలి. లైటింగ్ ఉండాలి కదా.. అవేవి లేకుండా ఎలా అనే డౌట్ రావొచ్చు. పరకాల బస్టాండ్ కు ఎదురుగ ఉన్న బిల్డింగ్ లో కేమెరాలు పెట్టారు. షూటింగ్ స్టార్ట్ కాగానే సాయి పల్లవికి మెసేజ్ ఇచ్చారు. సాధారణ అమ్మాయిలా ఆమె నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu