‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ‘పుష్ప-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న నాలుగో చిత్రమిది. తాజాగా అల్లు అర్జున్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారని టాక్. ఇటీవల ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథాంశం బాగా నచ్చడంతో అల్లు అర్జున్ ఈ సినిమాకు అంగీకరించారని అంటున్నారు. త్రివిక్రమ్తో చేయనున్న సినిమా పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కిస్తారని చెబుతున్నారు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఆఖరిలో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లే అవకాశం ఉందంట. ఇతర వివరాలు తెలియాలంటే.. అధికారిక ప్రకటన రావాలి.