ప్రస్తుతం రష్మిక మందన్నా బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఈమె బిగ్బి అమితాబ్ బచ్చన్తో కలిసి నటించిన ‘గుడ్బై’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. ఎవరి మీద ఆదరపడకుండా.. తన కాళ్ళ మీద తను నిలబడాలనుకునే క్యారెక్టర్లో రష్మిక నటించింది. అమితాబ్ బచ్చన్ తండ్రి పాత్రలో నటించాడు. తల్లి పాత్రలో నీనాగుప్తా నటించింది. ఎమోషనల్ రోలర్ క్రోస్టర్గా సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. వికాస్ బాహ్ల్ దర్వకత్వం వహించిన ఈ సినిమాని శోభా కపూర్ ఏక్తాకపూర్లు నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది.