HomeTelugu Big Storiesగీత సాక్షిగా: 'అందాల చందమామవే' ప్రోమో విడుదల

గీత సాక్షిగా: ‘అందాల చందమామవే’ ప్రోమో విడుదల

Andhala Chandhamamave Song

ఆదర్శ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘గీత సాక్షిగా’. చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఈ చిత్రానికి ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రాజా రవీంద్ర, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, అనిత చౌదరి, భరణి శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

కాగా, ఈ చిత్రం నుంచి ‘అందాల చందమామవే’ అనే పాటకు సంబంధించిన ప్రోమో నేడు విడుదలైంది. ఈ పాట పూర్తి వీడియో దీపావళి సందర్భంగా ఈ నెల 24న ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘గీత సాక్షిగా’ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించగా, రెహమాన్ సాహిత్యం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu