HomeTelugu Newsకరోనా టెస్ట్‌ చేయించుకున్న ఏపీ సీఎం

కరోనా టెస్ట్‌ చేయించుకున్న ఏపీ సీఎం

10 16
ఏపీ సీఎం జగన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా దేశం నుండి ఆంధ్రప్రదేశ్‌ లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న సందర్భంగా జగన్ తన కార్యాలయంలో కిట్లను ప్రారంభించారు. ఈ కిట్ ను ఉపయోగించి కేవలం 10నిమిషాల్లోనే కరోనాను నిర్ధారించవచ్చు. కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం కిట్లను దిగుమతి చేసింది. ఈ కిట్లను ఉపయోగించి జిల్లాల్లో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పరీక్షలు చేయనున్నారు. కాగా డాక్టర్లు మొదట ఈ కిట్ ను ఉపయోగించి జగన్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. 10 నిమిషాల తరవాత వచ్చిన రిపోర్ట్ లో సీఎం కు కరోనా నెగిటివ్ వచ్చింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించి త్వరలోనే కరోనా కు బ్రేక్ వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!