HomeTelugu Newsకీర్తి సురేశ్ 'పెంగ్విన్‌' తొలి పాట విన్నారా.?

కీర్తి సురేశ్ ‘పెంగ్విన్‌’ తొలి పాట విన్నారా.?

12a

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పెంగ్విన్‌’. ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కార్తికేయన్‌ సంతానం, సుధన్‌ సుందరం, జయరాం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాటను మంగళవారం రీలిజ్‌ చేశారు. ‘ప్రాణమే.. నా ప్రాణమే.. మరల వచ్చిందమ్మా..’ అని సాగే ఈ గీతాన్ని కీర్తి సురేశ్‌పై చిత్రీకరించారు. అపహరణకు గురైన తన కుమారుడు అజయ్‌ను గుర్తు చేసుకుంటూ ఆమె పడే బాధను ఇందులో చూపించారు. వెన్నెల కంటి ఈ పాటకు సాహిత్యం అందించారు. సుషా ఆలపించారు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం జూన్‌ 19న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మరోపక్క ‘గుడ్‌ లక్‌ సఖి’, ‘రంగ్‌దే’, ‘మిస్‌ ఇండియా’ సినిమాల్లోనూ నటిస్తున్నారు కీర్తి సురేశ్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu