HomeTelugu News'అరకు రోడ్' లో ఏం జరిగింది!

‘అరకు రోడ్’ లో ఏం జరిగింది!

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం ‘అర‌కు రోడ్ లో’. వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలన్ని పూర్తి చేసుకుని డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సందర్భం గా చిత్ర నిర్మాతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .
దర్శక ,నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవల “మా చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాద్ గారు, మరియు ఇతర సినీ ప్రముఖులు ప్రసాద్ ల్యాబ్ లో చూడడం జరిగింది. సినిమా చూసిన వారందరూ మెచ్చుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది . అలాగే ప్రభాస్ గారు విడుదల చేసిన సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. 30 ఇయర్స్ పృద్వి చేసిన రిస్క్ రసూల్ క్యారక్టర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పారు. 500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దుతో సినిమా ధియేటర్ లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గినప్పటికీ మా సినిమా ‘అరకు రోడ్ లో’ మీద వున్న నమ్మకంతో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2 న అత్యధిక ధియేటర్ లలో రిలీజ్ చేయనున్నాము అని అన్నారు .

Recent Articles English

Gallery

Recent Articles Telugu