HomeTelugu Trendingఅరవింద్ స్వామి, మధుబాల జంటగా మరోసారి

అరవింద్ స్వామి, మధుబాల జంటగా మరోసారి

Madhubala Aravind swamy
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటి మధుబాల నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆమె లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. 28 ఏళ్ల తర్వాత అరవిందస్వామి, మధుబాల కలిసి జంటగా నటిస్తున్నారు. 1992లో వచ్చిన మణిరత్నం మూవీ ‘రోజా’లో వీరిద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన తలైవి సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. నటి మధుబాల కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu