HomeTelugu Trendingసినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ సింగర్‌ మనవరాలు

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ సింగర్‌ మనవరాలు

Asha bhosle announced her g

ప్రముఖ సింగర్‌ ఆశా భోంస్లే మనవరాలు జ‌నై భోంస్లే మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయాన్ని ఆశా భోంస్లే తన ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. భారతీయ సినిమాల్లోకి త‌న మ‌న‌వ‌రాలు ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు.

“ది ప్రైడ్ ఆఫ్ భార‌త్‌-ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ చిత్రంలో నా అంద‌మైన మ‌న‌వ‌రాలు జ‌నై భోంస్లే భాగం కావ‌డం ప‌ట్ల నిజంగా చాలా సంతోషిస్తున్నాను. సినీ ప్ర‌పంచంలో జనై కోరుకుంటున్న‌ గమ్యస్థానాన్ని చేరుకుంటుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఆమెకు, సినిమా తీస్తున్న ద‌ర్శ‌కుడు సందీప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ఆమె తన పోస్ట్‌లో రాశారు.

‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్’ పేరుతో రాబోయే చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంసాలే పాత్రలో ఆమె మనవరాలు జ‌నై కనిపించనుంది. ఈ చిత్రం ద్వారా సందీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇమ్మెర్సో స్టూడియో, లెజెండ్ స్టూడియో కలిసి దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 19, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో జనైని ఎంపిక చేయడం పట్ల చిత్ర నిర్మాత సందీప్ సింగ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ కుటుంబ వంశానికి చెందిన వారసుడు, చాలా తెలివైన, నిష్ణాతులైన కుటుంబంతో తన వంశాన్ని పంచుకున్న జ‌నైని ప‌రిచ‌యం చేయ‌డం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దివంగత లతా మంగేష్కర్జీ, ఆశా భోంసలేజీ లకు మనవరాలు. రాణి సాయి బాయి పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తుంది” అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!