నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ ఆతర్వాత ప్రొడ్యూసర్ గా మారాడు. ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘తీన్మార్’, ‘గబ్బర్ సింగ్’ సినిమాలు చేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్తో ‘ఇద్దరమ్మాయిలు’. ఎన్టీఆర్ తో ‘బాద్షా’, ‘టెంపర్’ సినిమాలు నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు. అనంతరం మళ్లీ ఆషీకీ-2 తెలుగులో ‘నీ జతగా నేనుండాలి ‘ పేరుతో రీమేక్ చేసి ప్లాప్ అందుకున్నాడు. తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిన గణేష్ కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించారు. మరోసారి నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మెగా హీరోలకు ఇప్పటికే మూడు సినిమాలకు అడ్వాన్స్లు ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుస సినిమాతో బిజీగా ఉన్న సాయి ధరమ్ తేజ్ బండ్ల గణేష్తో ఓ సినిమా చేయబోతున్నాడనే ఫిలింనగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.