HomeTelugu Newsరేపు భారత్ బంద్‌..

రేపు భారత్ బంద్‌..

6 6
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినట్లు కేంద్ర కార్మిక సంఘాలు తెలిపాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఈ సమ్మెకు ఐఎన్‌టీయుసీ, ఏఐటీయుసీ, సీఐటీయు, టీయుసీసీ తదితర సంఘాలు తమ మద్దతు తెలిపాయి. జనవరి 2, 2020న జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర కార్మికశాఖ విఫలమైందనీ, దీంతో ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8న అఖిల భారత సమ్మె చేపట్టనున్నట్లు 10 కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా 60 విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన పలు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ సమ్మె కారణంగా బుధవారంనాడు పలు రకాల సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, రవాణా రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. బ్యాంక్‌ యూనియన్లు ముందుగానే ఈ విషయాన్ని బ్యాంకులకు తెలియజేశాయి.

”కేంద్రం ఇప్పటికే దేశంలోని 12 విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌లను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్-ఎంటీఎన్‌ఎల్ విలీనం తర్వాత 93,600 మంది టెలికాం కార్మికులు వీఆర్‌ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) పేరుతో ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించారు. వీటితో పాటు రైల్వే ప్రైవేటీకరణ, 49 రక్షణ ఉత్పత్తుల తయారీ యూనిట్ల కార్పొరేటీకరణ, ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్లు” కార్మిక సంఘాలు తెలిపాయి. దీనితో పాటు 175 మందికి పైగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక తమ డిమాండ్లతో గ్రామీణ బారత్‌ బంద్‌ పేరుతో ఈ సమ్మెకు మద్దతిస్తునట్లు ప్రకటించాయి. జేఎన్‌యూలో విద్యార్థులపై జరిగిన దాడిని కార్మిక సంఘాలు ఖండించాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తమ సంఘీభావాన్ని తెలిపాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu