లాక్డౌన్ ప్రతి ఒకరు తమలోని ప్రతిభాకు మెరుగులు దిద్దుతున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా రకరకాల వీడియోలు ఫోటోలు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా వెండి తెరపై హాస్య బ్రహ్మాగా పేరుతెచ్చుకున్న బ్రహ్మానందం ఆయనలోని చిత్రకళను బయటకు తీశారు. ఇంట్లో కూర్చొని శ్రీశ్రీ బొమ్మను పెన్సిల్ స్కెచ్ వేశారు. లాక్డౌన్ సమయంలో నాన్న మహాకవి శ్రీశ్రీ చిత్రాన్ని గీయడం చాలా సంతోషంగా ఉందంటూ.. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ సోషల్ మీడియా వేదికగా బ్రహ్మీ గీసిన శ్రీశ్రీ ఫోటోను షేర్ చేసారు. స్వతహాగా తెలుగు సాహిత్య నిపుణుడైన బ్రహ్మానందానికి దిగ్గజ కవి శ్రీశ్రీ అంటే అభిమానం.