అమితాబ్బచ్చన్, రణ్బీర్ కపూర్, ఆలియాభట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘బ్రహ్మాస్త్ర’. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ మూవీ యూనిట్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. కుంభమేళాకు వెళ్లిన చిత్ర బృందం సరికొత్తగా చిత్ర లోగోను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా రణబీర్, ఆలియాభట్లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డ్రోన్ల సాయంతో ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్ను చూపించారు. సినీ చరిత్రలో ఏ చిత్ర బృందమూ చేయని విధంగా లోగోను ఆవిష్కరించడం విశేషం. ఫాంటసీ అడ్వెంచర్గా ‘బ్రహ్మాస్త్ర’ మూడు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం 2019 ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.
#Brahmastra logo
Sky-show 🔥 pic.twitter.com/7NBi3h46yE— Team Ranbir Kapoor (@RanbirTeam) March 4, 2019