HomeTelugu Trendingఅప్పటి వరకు బ్రతకండి.. బ్రతకనివ్వండి: చార్మీ

అప్పటి వరకు బ్రతకండి.. బ్రతకనివ్వండి: చార్మీ

charmme kaur announces brea

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘లైగర్‌’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీ మంచి విజయం సాధిస్తుంది అని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్‌ టాక్‌ని మూటగట్టుకుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక లైగర్‌ ఫలితం అనంతరం చార్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఆమె ట్వీట్‌ చేస్తూ ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. తాను సోషల్‌ మీడియాకు బ్రేక్‌ ఇస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘గాయ్స్ కాస్త శాంతించండి. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా.. సోషల్ మీడియా నుంచి. పూరీ కనెక్ట్స్ మరింత దృఢంగా, మెరుగ్గా మళ్లీ తిరిగొస్తుంది. అప్పటి వరకు బ్రతకండి. బ్రతకనివ్వండి’. అని రాసుకోచ్చింది. ఇక చార్మీపై కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా లైగర్‌ ఫ్లాప్‌లో అంతా విజయ్‌తో పాటు పూరీ కనెక్ట్స్‌ నిర్మాతలైన చార్మీ, పూరీ జగన్నాథ్‌ను ఉద్ధశించి నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రమోషన్స్‌లో విజయ్‌ ఓవరాక్షన్‌, నోటి దురుసు వల్లే ఈసినిమా ఫ్లాప్‌ అయ్యిందని, అతడిని నమ్ముకున్నందుకు పూరీ కనెక్ట్స్‌ పని అయిపోయిందంటూ సోషల్‌ మీడియా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు చార్మీ, పూరీ కనెక్ట్స్‌ను ట్యాగ్‌ చేస్తూ సినిమా అసలు బాగోలేదని, విడుదలకు ముందు క్రియేట్‌ చేసిన హైప్‌ కథలోనే లేదని.. కథ, కథనం చాలా బలహీనంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న నెగిటివిటి కారణంగానే ఆమె సోషల్‌ మీడియాకు బ్రేక్‌ తీసుకుంటుందని నెటిజన్లు అభిప్రాయ పడుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu