HomeTelugu Trendingచిదంబరానికి అస్వస్థత

చిదంబరానికి అస్వస్థత

10 3
ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ లో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. చిదంబరానికి సంబంధిత వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలిస్తారని సంబంధిత వర్గాల సమాచారం. అయితే సాధారణంగా తీహార్ జైల్లో ఖైదీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలిస్తుంటారు. కానీ, చిదంబరం విషయంలో మాత్రం ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.

ఒకవేళ చిదంబరానికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే కనుక ఆయన్ని ఎయిమ్స్ కు లేదా ఆర్ఎంఎల్ ఆసుపత్రి, సఫ్దార్ జంగ్ ఆసుపత్రికి తరలించాలన్న కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. సీబీఐ కస్టడీలో ఉన్న చిదంబరం నాలుగు కేజీల బరువు తగ్గిపోయారు. తీహార్ జైల్లో ఆయనకు అందిస్తున్న ఆహారానికి ఆయన అలవాటుపడలేదు. జైలులో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలని చిదంబరం కోరినా.. కోర్టు తిరస్కరించింది. ఇంటి భోజనం తీసుకొచ్చేందుకు మాత్రం అంగీకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu