HomeTelugu Trending'ఆచార్య'ను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్న చిరంజీవి

‘ఆచార్య’ను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్న చిరంజీవి

chiranjeevi ready for Achar
టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్‌ జరుపుకుంది. 14 రోజుల పాటు చిత్రీకరణ జరిపితే షూటింగు పార్టు పూర్తవుతుంది. అందువలన ఈ నెల 7వ తేదీన మళ్లీ సెట్స్ పైకి వెళుతున్నారు. ఏకధాటిగా 14 రోజుల పాటు షూటింగును జరపనున్నారు. చిరంజీవి .. చరణ్ తదితరులు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

చిరంజీవికి జంటగా కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించనుంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలవనుందని అంటున్నారు. సోనూ సూద్, జిషు సేన్ గుప్తా కీలకమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో, సంగీత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. దసరా కానుకగా అక్టోబర్ 13 .. 14 తేదీలలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu